PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?

|

Nov 09, 2021 | 7:48 PM

PF Clients: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం

PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?
Pf Clients
Follow us on

PF Clients: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం జీతంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు కలుపుతారు. పనిచేసే కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఇపిఎఫ్‌కు సహకరించాలి. తద్వారా ఉద్యోగి విరమణ చేస్తే పెన్షన్‌గా కొంత మొత్తాన్ని పొందుతాడు. ఈ పని యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యుఎన్ ద్వారా జరుగుతుంది. అయితే తాజాగా ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో మినిమమ్‌ పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు మినిమమ్‌ పీఎఫ్ రూ.1000లుగా ఉంది. దీనిని ఆరు వేల వరకు పెంచుతారని కొంతమంది భావిస్తున్నారు. ఇది జరిగితే మాత్రం చాలామందికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ ట్రస్టీస్‌ సమావేశం నవంబర్‌ లో జరుగనుంది. ఈ సమావేశంలో మినిమమ్‌ పెన్షన్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ కూడా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి సందర్భంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ ట్రస్టీస్‌ మినిమమ్‌ పెన్షన్‌ని కనీసం రూ.3000 వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం కాకుండా ప్రైవేట్‌ కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్ మెంట్‌, వడ్డీ రేట్ల గురించి కూడా చర్చ జరుగనుంది. అయితే చాలామంది ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడుతాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని చందాదారుల ఖాతాకు బదిలీ చేయడం ప్రారంభించింది. EPFO 8.50% చొప్పున PF పై వడ్డీని చెల్లించాలి. మీ PF ఖాతాలో ప్రభుత్వం నుంచి దీపావళి బహుమతి వచ్చిందో లేదో కూడా మీరు మీ PF ఖాతాను తనిఖీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం

Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!