Gold Silver Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Gold Silver Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Follow us

|

Updated on: May 12, 2022 | 6:42 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వాస్తవానికి పసిడి, వెండి (Bullion Market) ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ క్రమంలో పసిడి, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. 10 గ్రాములు బంగారం.. 22 క్యారెట్లపై రూ.350, 22 క్యారెట్లపై రూ.380 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.60,400 గా ఉంది. రూ.1500 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,870, 24 క్యారెట్ల ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.60,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.64,800 ఉంది. బెంగళూరులో రూ.64,800, కేరళలో రూ.64,800 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800, విజయవాడలో రూ.64,800, విశాఖపట్నంలో రూ.64,800 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

నగదు లావాదేవీలపై సరికొత్త నిబంధనలు.. ఇకపై అవి చూపించాల్సిందే.. లేదంటే కష్టమే.. మే 26 నుంచి అమలు..

Cyclone Asani: అసని ఎఫెక్ట్‌తో విశాఖ నుంచి ఆగిన విమాన సర్వీసులు పునరుద్ధరణ