Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం.. అదే బాటలో వెండి..!

|

Oct 18, 2022 | 6:25 AM

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనది బంగారం. ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దీపావళి పండగ సమీపిస్తోంది. ధన్‌తేరాజ్‌

Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం.. అదే బాటలో వెండి..!
Gold Price Today
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనది బంగారం. ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దీపావళి పండగ సమీపిస్తోంది. ధన్‌తేరాజ్‌ వస్తోంది. దీంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. బంగారం రేట్లు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా అక్టోబర్‌ 18న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.46,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,300 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.60,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.60,500 ఉండగా, చెన్నైలో రూ.55,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.55,500 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.55,500 ఉంది. ఇక కేరళలో రూ.60,500 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి