Gold Silver Price Today: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

May 23, 2022 | 6:35 AM

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బ్రేక్ పడింది. సోమవారం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి.

Gold Silver Price Today: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us on

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బ్రేక్ పడింది. సోమవారం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.61,400 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,170, 24 క్యారెట్ల ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.65,900 ఉంది. బెంగళూరులో రూ.65,900, కేరళలో రూ.65,900 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900, విజయవాడలో రూ.65,900, విశాఖపట్నంలో రూ.65,900 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.