Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
బంగారం కొనుగోలు దారులకు ఊరట. గత కొన్ని రోజుల వరకు పరుగులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు సోమవారం (అక్టోబర్ 23) మాత్రం స్థిరంగా కొనసాగాయి. ఆదివారంతో పోల్చుకుంటే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 56,600 ధర పలుకుతోంది

బంగారం కొనుగోలు దారులకు ఊరట. గత కొన్ని రోజుల వరకు పరుగులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు సోమవారం (అక్టోబర్ 23) మాత్రం స్థిరంగా కొనసాగాయి. ఆదివారంతో పోల్చుకుంటే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 56,600 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.75, 300 పలుకుతోంది. మరి సోమవారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా..
- హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
- ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు పలుకుతుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలిలా..
- చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర 56,700 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,850 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయలు ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,750 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,900 రూపాయలు ఉంది.
- కోల్కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయలు ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల ధర 56,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 61,750 రూపాయల వద్ద ఉంది.
వెండి ధరలిలా..
ఇక సోమవారం వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. దేశవ్యాప్తంగా ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 75,300 రూపాయలు పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 78,700 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో రూ. 75,300గా ఉండగా, చెన్నైలో 78,700లకు కిలో వెండి లభిస్తోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..