
గత కొన్నాళ్లు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ శాంతించాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరల్లు శుక్రవారం నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మే 23 హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాల్లోని రిటైల్ మార్కెట్ ధరల ప్రకారం 10 గ్రాముల బంగారానికి సుమారు రూ. 300 నుండి రూ. 440 వరకు తగ్గంది. అంతర్జాతీయ కారణాలతో పాటు భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 నుండి 15శాతానికి పెంచింది. దీంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరిగాయి. కానీ ఇటీవల కొనుగోళ్లు తగ్గించాలని ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత మార్కెట్లో స్వల్పంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. అందుకే ధరల్లో ఈరోజు స్వల్ప తగ్గుదల కనిపించింది.
శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం ధరలు ఇలా
తాజా హెచ్చుతగ్గుల తర్వాత దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59, 480గా ఉండగా నిన్న ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,59,940గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,46,190గా ఉండగా నిన్న ఈ ధర రూ.1,46,610 గా ఉంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,84,900గా ఉంది. నిన్న ఈ ధరల రూ.2,85,100గా ఉంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా
వెండి ధరలు ఇలా
దేశ వ్యాప్తంగా ముంబై, డిల్లీ, కోల్కతా,పూణె , బెంగళూరు నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,84,900గా ఉంటే.. హైదరాబాద్, చెన్నై, కేరళలో కేజీ వెండి ధర రూ.2,95,100గా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి