Gold Silver Rate Today: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బంగారం, వెండి ధరలు పెరిగాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.49,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,950 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్లపై రూ.220 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.900 మేర పెరిగి రూ.65,200 లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,200 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,200, చెన్నైలో కిలో వెండి ధర రూ.71,600, బెంగళూరులో రూ.71,600, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.71,600, విజయవాడలో రూ.71,600, విశాఖపట్నంలో రూ.71,600 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..