
ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. జనవరిలో గోల్డ్ రేటు రూ.1.90 లక్షల మార్క్కు చేరుకోగా.. వెండి ధర రూ.4 లక్షల మార్క్ను అధిగమించి ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి. ఆ తర్వాత గత కొద్ది వారాల నుంచి ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. గత ఏడాది ధరలు ఒకేసారి రికార్డ్ స్థాయిలో పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపర్చగా… ఈ ఏడాది ఎలా ఉంటాయనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ధరలు.. ఇప్పుడు మళ్లీ భారీగా పతనమవుతున్నాయి. బంగారం రూ.లక్ష కిందకు పడిపోవచ్చని, వెండి రూ.2 లక్షలకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గుతుండటంతో ఆ అంచనాలను బలపరుస్తున్నాయి.
బుధవారం వెండి ధర ఒకేరోజు రూ.5 వేల మేర పడిపోయింది. బుధవారం కేజీ సిల్వర్ రూ.2.60 లక్షలకు చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ.2.65 లక్షల వద్ద స్ధిరపడింది. నిన్నటితో పొలిస్తే ఇవాళ కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో కేజీ వెండి ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక బెంగళూరులో బుధవారం కేజీ సిల్వర్ రేటు రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.60 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్నటితో చూస్తే అన్ని ప్రాంతాల్లో కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గిందని చెప్పవచ్చు. సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
వెండితో పాటు బంగారం ధరలు కూడా పడిపోయాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్(MCX)లో బంగారం, వెండి రేట్లు పాజిటివ్ నోట్తో ప్రారంభమయ్యాయి. జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి కనిపించడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆందోళనలు కాస్త తగ్గాయి. దీంతో సురక్షితమైన కొనుగోలుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. ఎంసీఎక్స్లో ఏప్రిల్ 2026 డెలివరీకి సంబంధించి గోల్డ్ ప్యూచర్స్ 10 గ్రాములకు 1.2 శాతం పెరిగి రూ.1,53,303కి చేరుకుంది. ఇక మార్చి 5న జరగాల్సిన సిల్వర్ ప్యూచర్స్ కిలోకు 2 శాతం పెరిగి రూ.2,33,339కి చేరుకున్నాయి. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,54,350 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,500 వద్ద ఉంది. బంగారం ధరలు ప్రస్తుతం స్ధిరంగా కొనసాగుతున్నాయి.