
అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశాలే మార్కెట్లో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఎందుకంటే.. గుడ్రిటర్న్ వెబ్సైట్ ప్రకారం. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ధర రూ,1,520 తగ్గగా.. మంగళవారం నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు తులంపై మరో రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,33,850గా కొనసాగుతుంది, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,690గా కొనసాగుతుంది.
అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. మంగళవారంతో పోల్చుకుంటే వెండి ధరలు కూడా కాస్తా తగ్గుముఖం పట్టి కొనుగోలు దారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. అంటే మంగళవారం కేజీ వెండి ధర రూ.1,99,000 గా ఉండగా ఇవాళ ఉదయం 6 గంటలకు రూ.100 తగ్గి కేజీ బంగారం ధర రూ. 1,99,100 వద్ద కొనసాగుతుంది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఇది గుర్తుంచుకోండి
ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు కారణంగా ఎప్పటికప్పుడూ వాటి ధరలు అప్డేట్ అవుతుంటాయి. కొన్ని సార్లు పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదా స్థిరంగా కొనసాగవచ్చు. కాబట్టి మీరు బంగారం కొనే ముందు ధరలను తెలుసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి