Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా తాజాగా బుధవారం వారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి...

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us

|

Updated on: Dec 20, 2023 | 6:29 AM

దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో ఎంతోకొంత పెరుగుదల కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా తాజాగా బుధవారం వారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,40 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,620 వద్ద కొనాసగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 57,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర అత్యధికంగా రూ. 63,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై బుధవారం రూ. 500 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 77,500కి చేరుకుంది. ఇక చెన్నై, కేరళతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్