Free Cylinder: దీపావళికి ముందు ఉచిత సిలిండర్లు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Oct 18, 2024 | 9:41 PM

గతేడాది ఇక్కడ ప్రభుత్వం 85 లక్షల మంది మహిళలతో సహా 1.85 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేసింది. ఇక్కడ 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 842.42. ఈ సిలిండర్ ధర సెప్టెంబర్ నాటికి ఉంది..

Free Cylinder: దీపావళికి ముందు ఉచిత సిలిండర్లు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us on

దీపావళి పండుగ దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా ఇంటి వద్ద వంటలు తయారు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచిత ఎల్‌పిజి సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీపావళికి ముందే కర్వా చౌత్, అహోయి అష్టమి వంటి పండుగలు రానున్నందున నిరుపేద కుటుంబాలకు మరింత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది యూపీ ప్రభుత్వం.

దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 1.86 కోట్ల కుటుంబాలకు ఇచ్చిన హామీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చనుంది. ఈ కానుకకు రూ.1,890 కోట్లు కేటాయించారు. ‘డబుల్ ఇంజిన్ గవర్నమెంట్’ అనే ఈ చొరవ కింద ఉచిత సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చిందని, దానిని నెరవేర్చే పని ప్రారంభించామని యూపీ ప్రభుత్వంప్రకటన విడుదల చేసింది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద హోలీ, దీపావళి పండుగల సందర్భంగా రాష్ట్రంలో రెండేళ్ల పాటు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు త్వరితగతిన పంపిణీ పూర్తి చేసే బాధ్యతను ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ శాఖ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఉచిత సిలిండర్ పొందాలంటే ఏం చేయాలి?

మహిళలు ప్రత్యేకంగా ఈ ఉచిత సిలిండర్‌ను పొందడానికి వేచి ఉన్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడనుంది. ఈ పథకం కింద ఆధార్‌ పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఆధార్ ప్రామాణీకరణ పూర్తయిన వారికి దీపావళి లోపు ఉచిత సిలిండర్ పొందడానికి మార్గం ఉంటుంది. బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానించి చెల్లుబాటు అయ్యే లబ్ధిదారులకు మాత్రమే ఈ ఉచిత సిలిండర్ అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Jio: జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!

గతేడాది కూడా ప్రభుత్వం ఉచితంగా సిలిండర్ల పంపిణీ:

గతేడాది ఇక్కడ ప్రభుత్వం 85 లక్షల మంది మహిళలతో సహా 1.85 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేసింది. ఇక్కడ 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 842.42. ఈ సిలిండర్ ధర సెప్టెంబర్ నాటికి ఉంది. ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.300 సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇది కూడా చదవండి: Ratan TATA: రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి ఎవరికి? తన చివరి కోరిక తీర్చే బాధ్యత ఆ నలుగురిదే!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి