Work Load: జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
ఇటీవల కాలంలో యూకేజీ వర్క్ఫోర్స్కు సంబంధించిన కొత్త ప్రపంచ అధ్యయనం ప్రకారం ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో నిర్వాహకులు పెద్ద ప్రభావాన్ని చూపుతున్నారని వెల్లడైంది. ఉద్యోగుల విశ్వసనీయతను పెంపొందించడంతో పాటు బహిరంగ సంభాషణను పెంపొందించడం, ఉద్యోగులను వ్యక్తిగతంగా చూసుకోవడం వంటి పనుల వల్ల వారి ఉత్పాదకత పెరిగిందని తేలింది.
భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అధిక జనాభా నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య ఇక్కడ అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పని భారం ఉద్యోగులను అధికంగా వేధిస్తుంది. ఇటీవల కాలంలో యూకేజీ వర్క్ఫోర్స్కు సంబంధించిన కొత్త ప్రపంచ అధ్యయనం ప్రకారం ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో నిర్వాహకులు పెద్ద ప్రభావాన్ని చూపుతున్నారని వెల్లడైంది. ఉద్యోగుల విశ్వసనీయతను పెంపొందించడంతో పాటు బహిరంగ సంభాషణను పెంపొందించడం, ఉద్యోగులను వ్యక్తిగతంగా చూసుకోవడం వంటి పనుల వల్ల వారి ఉత్పాదకత పెరిగిందని తేలింది. భారతదేశంలో దాదాపు నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు (72 శాతం) తమ మేనేజర్ మద్దతు, ప్రోత్సాహం లేదా నాయకత్వం తమను కార్యాలయంలో పైకి వెళ్లడానికి నేరుగా ప్రేరేపిస్తుందని తెలిపారు. అలాగే ఐదింట రెండు వంతుల మంది ఉద్యోగులు (40 శాతం) మంచి మేనేజర్ని కలిగి ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో యూకేజీ అధ్యయనంపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో 91 శాతం మంది ఉద్యోగులు తమ మేనేజర్లు తమ పనితీరును మెరుగుపరచడానికి, వారితో స్పష్టమైన పనితీరు లక్ష్యాలను రూపొందించడంలో సహాయపడిందని అంగీకరిస్తున్నారు. 88 శాతం మంది ఉద్యోగులు తమ మేనేజర్ విభిన్న ఆలోచనలకు విలువనిస్తారని పేర్కొన్నారు. 86 శాతం మంది ఉద్యోగులు తమ పనిని తమ మేనేజర్ల పనిలా చూపుతున్నారని పేర్కొంటున్నారు. భారతదేశంలోని 89 శాతం మంది ఉద్యోగులు సవాళ్లు, పనిలో అదనపు బాధ్యతల ద్వారా ఎక్కువగా ప్రేరేపించారని వివరిస్తున్నారు. 84 శాతం మంది ఉద్యోగులు తమ మేనేజర్ తమపై శ్రద్ధ వహిస్తారని, సానుభూతి కలిగి ఉంటారని నమ్ముతున్నారని కూడా అధ్యయనం వెల్లడించింది.
భారతదేశంలోని 78 శాతం మంది ఉద్యోగులు శారీరక మరియు మానసిక అలసటకు దారితీసే ఏదో ఒక రకమైన ఉద్యోగ బర్న్అవుట్ను అనుభవిస్తున్నారని వెల్లడైంది. భారతదేశానికి చెందిన 64 శాతం మంది ఉద్యోగులు తగిన వేతన కోత కోసం పనిభారం తగ్గింపును తక్షణమే అంగీకరిస్తున్నారనే విషయం షాకింగ్గా అనిపించిందని యూకేజీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మెజారిటీ ఉద్యోగులు ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యత ప్రాముఖ్యతను గుర్తించారని, ఆర్థిక లాభం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.
మారుతున్న కార్యాలయ సంస్కృతి
భారతదేశంలోని 76 శాతం మంది ఉద్యోగులు తమ పని తమకు కేవలం ‘ఉద్యోగం’ కంటే ఎక్కువ అని నమ్ముతున్నారు. అలాగే 72 శాతం మంది ఉద్యోగులు తమ సంస్థలో తాము ఒక మార్పును కలిగి ఉన్నారని నిజంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే మేనేజర్లతో పాటు కార్యాలయ సంస్కృతిని మార్చడం, పని చేయడానికి మరింత ప్రయోజనం ఆధారిత విధానం వైపు ఈ మార్పును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి