Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు..

Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?
Elon Musk, Twitter
Follow us

|

Updated on: Nov 01, 2022 | 1:52 PM

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఈవో తో సహా పలువురు ఉన్నత ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్ తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్‌ అని పేర్కొన్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో ఎలన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ట్విటర్‌ సీఈఓ పదవిని ఎలన్ మస్క్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్‌ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని సంస్థ అధినేత ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్‌గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాడు. ఇంతకంటే వివరాలేమీ మస్క్‌ వెల్లడించలేదని సమాచారం.

ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్న ఎలన్ మస్క్‌ ఇక ట్విటర్‌ సీఈఓగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను ఇప్పటివరకు నియమించలేదు. క్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో తానే ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని మస్క్‌ పేర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెట్టుబడిదారుల్లో సౌదీ యువరాజు ట్విటర్‌ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌, ట్విటర్‌ సహా వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె ఉన్నట్లు తెలుస్తోంది. తలాల్‌కు చెందిన కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ ట్విటర్‌లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మస్క్ తర్వాత కంపెనీలో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా సౌదీ యువరాజు ఉండనున్నారు. ఇక, జాక్‌ డోర్సే 978 మిలియన్‌ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్టర్‌గా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి