Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు..

Twitter: ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం.. సీఈఓ కానున్న సంస్థ అధినేత..?
Elon Musk, Twitter
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 01, 2022 | 1:52 PM

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ సంస్థలో సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఈవో తో సహా పలువురు ఉన్నత ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్ తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్‌ అని పేర్కొన్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో ఎలన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ట్విటర్‌ సీఈఓ పదవిని ఎలన్ మస్క్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్‌ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని సంస్థ అధినేత ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్‌గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాడు. ఇంతకంటే వివరాలేమీ మస్క్‌ వెల్లడించలేదని సమాచారం.

ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్న ఎలన్ మస్క్‌ ఇక ట్విటర్‌ సీఈఓగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను ఇప్పటివరకు నియమించలేదు. క్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల్లో తానే ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని మస్క్‌ పేర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెట్టుబడిదారుల్లో సౌదీ యువరాజు ట్విటర్‌ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌, ట్విటర్‌ సహా వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె ఉన్నట్లు తెలుస్తోంది. తలాల్‌కు చెందిన కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ ట్విటర్‌లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మస్క్ తర్వాత కంపెనీలో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా సౌదీ యువరాజు ఉండనున్నారు. ఇక, జాక్‌ డోర్సే 978 మిలియన్‌ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఇన్వెస్టర్‌గా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!