AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oils Price: వంట నూనె ధరలు మళ్లీ పెరగనున్నాయా..? కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

ఇప్పుడు మళ్లీ ఎడిబుల్ ఆయిల్ ధరపై రచ్చ మొదలైంది. ఇప్పుడు దేశంలో ఎడిబుల్ ఆయిల్‌పై ఇస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది..

Edible Oils Price: వంట నూనె ధరలు మళ్లీ పెరగనున్నాయా..? కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
Edible Oils
Subhash Goud
|

Updated on: Feb 10, 2023 | 7:58 AM

Share

ఇప్పుడు మళ్లీ ఎడిబుల్ ఆయిల్ ధరపై రచ్చ మొదలైంది. ఇప్పుడు దేశంలో ఎడిబుల్ ఆయిల్‌పై ఇస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. గత 6 నెలల్లో గ్లోబల్ ట్రెండ్‌తో పాటు భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుతున్నందున, ప్రభుత్వం ఇప్పుడు వాటి దిగుమతి సుంకంపై ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవచ్చు.

గత ఏడాది సెప్టెంబర్‌లో ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతిపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. దేశంలో పెరుగుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరల దృష్ట్యా ప్రజలు ఎడిబుల్ ఆయిల్స్‌పై ఉపశమనం పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆవాల పంట వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సంబంధిత వర్గాలు చెబుతున్నప్పటికీ, దిగుమతి సుంకాన్ని పెంచడం లేదా మళ్లీ అమలు చేయడంపై నిర్ణయం అప్పుడే ఖరారు కానుంది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన వార్తల ప్రకారం.. దేశీయ ఆవాలు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత దిగుమతి సుంకంపై మినహాయింపును తొలగించే నిర్ణయం తీసుకోవచ్చని వర్గాలు తెలిపాయి. ఇది మే 2023 నాటికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఇటీవల జరిగిన సంభాషణలో అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న భయంతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చౌకగా దిగుమతి చేసుకునే ఎడిబుల్ ఆయిల్ వల్ల దేశంలోని రైతులు తమ ఆవాల పంటకు సరైన ధర లభించడం కష్టమవుతుందని కూడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలాఖరులోగా పంట కోతలు ప్రారంభమవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, 2022-23 (జూలై-జూన్) పంట సంవత్సరంలో ఆవపిండి ఉత్పత్తి 12.5 మిలియన్ టన్నులు (MT) దాటే అవకాశం ఉంది. ఇది గత సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ.

ఇవి కూడా చదవండి

వార్షిక ఎడిబుల్ ఆయిల్ దిగుమతి 13 మిలియన్ టన్నులు. ఇందులో పామాయిల్ దిగుమతి 8 మిలియన్ టన్నులు, సోయాబీన్ 2 లక్షల 70 వేల టన్నులు, సన్‌ఫ్లవర్ ఆయిల్ 2 మిలియన్ టన్నులు. పామాయిల్ చాలా మలేషియా, ఇండోనేషియా నుండి దిగుమతి అవుతుంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధానంగా అర్జెంటీనా, ఉక్రెయిన్ నుండి దిగుమతి అవుతాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎడిబుల్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది.

పామాయిల్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే ఇండోనేషియా గత ఏడాది ఏప్రిల్‌ 28న పామాయిల్‌ ఎగుమతిపై నిషేధం విధించినందున అంతర్జాతీయంగా పామాయిల్‌ ధరలు పెరిగాయి. మూడు వారాల తర్వాత ఈ నిషేధం ఎత్తివేసింది. అప్పటి నుండి ప్రపంచ మార్కెట్‌లో పామాయిల్ ధరలు తగ్గుతున్నాయి. ఆవనూనె ద్రవ్యోల్బణం డిసెంబర్ 2022లో 8.6 శాతానికి తగ్గింది. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల, దేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి