AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.. పనులు మొదలు పెట్టనున్న రైల్వే శాఖ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ముంబైలోని విక్రోలి ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ప్రారంభించిన భూసేకరణకు వ్యతిరేకంగా గోద్రెజ్ అండ్‌ బోయ్స్ దాఖలు చేసిన..

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.. పనులు మొదలు పెట్టనున్న రైల్వే శాఖ
Bullet Train
Subhash Goud
|

Updated on: Feb 09, 2023 | 3:06 PM

Share

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ముంబైలోని విక్రోలి ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ప్రారంభించిన భూసేకరణకు వ్యతిరేకంగా గోద్రెజ్ అండ్‌ బోయ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, ప్రజా సంక్షేమం కోసమేనని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఆర్‌డి ధనుక, జస్టిస్ ఎంఎం సత్తయేలతో కూడిన డివిజన్ బెంచ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనదని, ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇక హైకోర్టు తీర్పుతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయ్యింది. దీంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించనుంది రైల్వే శాఖ.

అయితే ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కి.మీ రైలు మార్గంలో 21 కి.మీ భూగర్భంలో ఉంటుంది. భూగర్భ సొరంగం ప్రవేశ స్థానం విక్రోలిలోని గోద్రెజ్ భూమిపై వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) కంపెనీ కారణంగా మొత్తం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, అయితే ప్రాజెక్ట్ ప్రజలకు ముఖ్యమైనదని పేర్కొంది. గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌లోని విఖ్రోలి ప్రాంతంలో ఉన్న ప్రాంతం మినహా మొత్తం ప్రాజెక్టు రూట్‌కు సంబంధించిన సేకరణ ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం ఇచ్చింది:

గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీకి రూ.264 కోట్ల పరిహారం చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. తనకు పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ గోద్రెజ్ అండ్‌ బోయ్స్ పిటిషన్ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి