Financial Scam: అనుమానమే ఆదా చేసింది.. మోసగాళ్లకు అదిరే జర్క్ ఇచ్చిన లాయర్

|

Apr 02, 2024 | 5:00 PM

పోలీసుల కథనం ప్రకారం మోసగాళ్లు ఇటీవల 30 ఏళ్ల న్యాయవాదిని సంప్రదించారు. ఆమె ఇరాన్‌కు పంపడానికి ప్రయత్నించిన ప్యాకేజీలో సింథటిక్ డ్రగ్ ఎల్‌ఎస్‌డీ ఉందని ఆమెను భయపెట్టి కేసు పెడతామని బెదిరించి డబ్బు కొట్టేదామని ప్లాన్ వేశారు. అయితే ఆ లాయర్ ఎలా తెలివిగా వ్యవహరించి మోసాన్ని బయటపెట్టిందో? ఓ సారి తెలుసుకుందాం. 

Financial Scam: అనుమానమే ఆదా చేసింది.. మోసగాళ్లకు అదిరే జర్క్ ఇచ్చిన లాయర్
New Scam
Follow us on

ప్రఖ్యాత లాజిస్టిక్స్ కంపెనీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన వారిగా నటిస్తూ మోసగాళ్లు ముంబైకి చెందిన మహిళా న్యాయవాది నుండి రూ.80 లక్షలను స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అప్రమత్తంగా ఉండడం వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు. పోలీసుల కథనం ప్రకారం మోసగాళ్లు ఇటీవల 30 ఏళ్ల న్యాయవాదిని సంప్రదించారు. ఆమె ఇరాన్‌కు పంపడానికి ప్రయత్నించిన ప్యాకేజీలో సింథటిక్ డ్రగ్ ఎల్‌ఎస్‌డీ ఉందని ఆమెను భయపెట్టి కేసు పెడతామని బెదిరించి డబ్బు కొట్టేదామని ప్లాన్ వేశారు. అయితే ఆ లాయర్ ఎలా తెలివిగా వ్యవహరించి మోసాన్ని బయటపెట్టిందో? ఓ సారి తెలుసుకుందాం. 

తాము ఒక ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీకి చెందినవారమని, మీరు పంపిన పార్శిల్‌లో అనుమానిత పదార్థాన్ని వారు కనుగొన్నారని వారు ఆమెకు చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, కేసును మూసివేయడానికి ఆమె ఆధార్, పాన్ కార్డ్ వివరాలను కోరారు. ఆ తర్వాత వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి అని చెప్పి మరో వ్యక్తికి ఫోన్‌ను బదిలీ చేసినట్లు నటించారు. కేసు నుంచి బయటపడటానికి కాల్ చేసిన వ్యక్తి తన బ్యాంక్ ఖాతా నుండి 80 లక్షల రూపాయల చెక్కును అతను పేర్కొన్న ఖాతాలో జమ చేయమని కోరాడు.. అది ప్రామాణికమైనదిగా కనిపించడానికి వారు ఆమెకు అగ్రిమెంట్ కాపీని పంపారు. అయితే కేసు భయంతో ఆ న్యాయవాది తన బ్యాంకు ఖాతా వివరాలను కూడా మోసగాళ్లతో పంచుకున్నారు. అయితే ఆమెకు అనుమానం వచ్చి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని బాంద్రా పోలీసులను ఆశ్రయించింది. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అవగాహనతోనే సమస్యలు దూరం

భారతీయ కస్టమ్స్ పేరుతో జరుగుతున్న మోసాలపై గత ఏడాది ఆగస్టులో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. భారతీయ కస్టమ్స్ పేరుతో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్‌లు, ఇమెయిల్‌లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోవద్దని కోరింది. వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో కస్టమ్స్ డ్యూటీ చెల్లించడానికి భారతీయ కస్టమ్స్ ఎప్పుడూ కాల్ చేయదని లేదా ఎస్ఎంఎస్‌లను కూడా పంపదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయ కస్టమ్స్ నుండి అన్ని కమ్యూనికేషన్లు సీబీఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ధ్రువీకరించే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డీఐఎన్)ని కలిగి ఉంటాయని వివరించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి