
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే దీన్ని ఒకేసారి చెల్లించే కన్నా ఈఎంఐల రూపంలో చెల్లించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే బ్యాంకులే కస్టమర్లకు ఈఎంఐ చెల్లించే ఓ పథకం ఉన్నది తెలుసా? ప్రముఖ బ్యాంకు ఎస్బీఐ ఈ పథకాన్ని అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనేది బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది వినియోగదారులకు అనేక పథకాలు, ఆర్థిక లాభాలను అందిస్తుంది. వినియోగదారులకు పూర్తి ఆర్థిక భద్రతతో పాటు మూలధన వృద్ధిని అందిస్తూ ఉంటుంది. ఇటీవల తన కస్టమర్ల కోసం యాన్యుటీ డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ఆదాయం నెలవారీ వాయిదాలలో (ఈఎంఐ) సంపాదించవచ్చు. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో ఒకసారి డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఈఎంఐ ద్వారా రాబడిని పొందవచ్చు. ఈ పథకాన్ని నెలవారీ వార్షిక వాయిదా అని కూడా అంటారు. డిపాజిట్కు సంబంధించిన కాలపరిమితి 3, 5, 7 లేదా 10 సంవత్సరాలు ఉంటుంది. వడ్డీ రేటు కూడా అదే కాలానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. అదనపు ఆదాయాన్ని పొందేందుకు ఈ పథకం మంచి మార్గం. ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనాలు, డబ్బు సంపాదించే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో కస్టమర్లు ఒకేసారి ఏకమొత్తం మొత్తాన్ని బ్యాంకుకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బు కాలక్రమేణా సమానమైన నెలవారీ వాయిదాలలో ఎస్బీఐ ద్వారా తిరిగి వస్తుంది. ఈ ఈఎంఐ మొత్తాలు ప్రధాన మొత్తంతో పాటు వడ్డీలో కొంత భాగాన్ని కలిగి ఉంటాయి. ఈ పథకంలో వడ్డీ త్రైమాసికానికి సమ్మేళనం చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి