దేశంలోని దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్పీజీ కనెక్షన్ ఉంటుంది. ఆసక్తికరంగా ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్లు వారి కుటుంబానికి రూ. 50 లక్షల కాంప్లిమెంటరీ ప్రమాద బీమాను స్వయంచాలకంగా అందుకుంటారు. ఈ ప్రమాదబీమా కోసం వినియోగదారులు ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్పీజీ సిలిండర్లోని గ్యాస్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే అనుకోని సందర్భంలో సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే వినియోగదారులు ప్రమాద బీమాను అప్లయ్ చేసుకోవడానికి అర్హులవుతారు. తమ కుటుంబాలకు పెట్రోలియం కంపెనీల నుండి రూ. 50 లక్షల క్లెయిమ్చేసుకోవచ్చు.
ప్రమాదం జరిగితే ఆ వివరాలతో సమీపంలోని పోలీస్ స్టేషన్తో పాటు మీ గ్యాస్ కంపెనీకు సమాచారం అందించాలి. ఆ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న బీమా కంపెనీ సమగ్ర విచారణ జరుపుతుంది. సిలిండర్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన తర్వాత బీమా కంపెనీకి నోటిఫికేషన్ వస్తుంది. విచారణ నివేదిక తర్వాత క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. క్లెయిమ్కు మద్దతు ఇవ్వడానికి, పోలీసు ఫిర్యాదు, చికిత్స ఖర్చులు, బిల్లులు, దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు, పోస్ట్మార్టం లేదా మరణ ధ్రువీకరణ పత్రం వివరాలను భద్రం చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి