
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ విపరీతంగా విస్తరించింది. ప్రతి ఒక్కరూ దానిలో పెట్టుబడులు పెడుతున్నారు. పేటీఎం కొత్త ఫీచర్ తో బ్రోకరేజ్ యాప్ లలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాక్ ట్రేడర్లు తమ బ్యాంక్ ఖాతాలో నిధులను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలకు పెద్ద మొత్తాలను బదిలీ చేయనవసరం ఉండదు. బ్రోకర్లు డబ్బులను బదిలీ చేయడానికి బదులుగా వ్యాపారులు తమ ఖాతాలో నిధులను బ్లాక్ చేస్తారు.
పేటీఎంగా పిలిచే వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ తీసుకువచ్చిన యూటీఐ ట్రేడింగ్ బ్లాక్ ఫీచర్ ను సింగిల్ బ్లాక్ మల్టిఫుల్ డెబిట్స్ అని కూాడా పిలుస్తారు. దీని వల్ల స్టాక్ ట్రేడర్లకు బ్రోకింగ్ అనుభవం సులభతరం అవుతుంది. బ్లాక్ చేసిన డబ్బు వినియోగదారుడి ఖాతాలోనే ఉంటుంది. ట్రేడ్ జరిగే వరకూ దాని మీద వడ్డీ అందుతుంది. ట్రేడింగ్ పూర్తయిన తర్వాత యూపీఐ పిన్ అవసరం లేకుండానే అవసరమైన మొత్తాన్ని తీసుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి