Farming Women: కూరగాయల సాగుతో ఆర్థిక సమస్యలకు చెక్.. రోజుకు రూ.5 వేల సంపాదన
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధానాలు, ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టింది. పారిశ్రామికత వైపు జనం కదులుతున్న వేళ బీహార్లోని గీతాదేవి సంప్రదాయ వ్యవసాయాన్ని ఆశ్రయించి చక్కని ఆదాయాన్ని ఆర్జించింది. ఆమె స్వయంగా పండించిన కూరగాయలను అమ్మకందారులకు లేదా మార్కెట్కి అమ్మడం ద్వారా రోజుకు సుమారు రూ. 5,000 సంపాదిస్తుంది.

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపిన వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధానాలు, ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టింది. పారిశ్రామికత వైపు జనం కదులుతున్న వేళ బీహార్లోని గీతాదేవి సంప్రదాయ వ్యవసాయాన్ని ఆశ్రయించి చక్కని ఆదాయాన్ని ఆర్జించింది. ఆమె స్వయంగా పండించిన కూరగాయలను అమ్మకందారులకు లేదా మార్కెట్కి అమ్మడం ద్వారా రోజుకు సుమారు రూ. 5,000 సంపాదిస్తుంది. ఆమెకు 120 సెంట్ల భూమి ఉంది. అందులో ఆమె బెండకాయలు, పచ్చిమిర్చి, సీసా, కుసుమ ఆకుకూరలు మరియు టమోటా వంటి వివిధ కూరగాయలను పండిస్తుంది. గీతాదేవి సక్సెస్ స్టోరీ గురించి మనం కూడా ఓ సారి తెలుసుకుందాం.
గీతాదేవి బీహార్లోని బెగుసరాయ్ జిల్లా దండారీ బ్లాక్కు చెందినవారు. టీవీలో ఓ కార్యక్రమాన్ని చూసి కూరగాయల సాగులో స్ఫూర్తి పొందానని చెప్పారు. ఆ సమయంలో కూరగాయల సాగును మహిళలకు మంచి ఆదాయ వనరుగా చూపించారని ఆమె అన్నారు. ఒకే పొలంలో ఒకేసారి అనేక రకాల కూరగాయలను పండించడం ద్వారా ఎంత మంచి ఆదాయం పొందవచ్చో? చూపించారని వివరించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని 120 సెంట్లను మూడు ప్లాట్లలో అంటే ఒక్కొక్కటి 40 సెంట్ల లెక్కన పచ్చి కూరగాయలు సాగు చేయడం ప్రారంభించానని గీతాదేవి తెలిపారు. తన భూమిలో కూరగాయలు మాత్రమే సాగుచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తన వ్యవసాయ వ్యాపారాన్ని వివరిస్తూ ఉదయాన్నే ప్రజలు కూరగాయల ధరలను తెలుసుకోవడానికి సమీపంలోని అనేక మార్కెట్లకు ఫోన్ చేస్తానని గీతాదేవి చెప్పారు. అలా తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువ ధర చెల్లిస్తున్నారో? అక్కడకే కూరగాయలను తీసుకెళ్లి అమ్ముతానని వివరించారు.
ప్రస్తుతం గీత ప్రకారం వంకాయల సాగు చేస్తుంఇ. కూరగాయల సాగుకు రోజుకు సుమారు రూ.500 ఖర్చు అవుతుందని ఆమె తెలిపారు. అయితే ఈ కూరగాయల అమ్మకం ధర పెట్టుబడి మొత్తాన్ని భర్తీ చేస్తుంది. కూరగాయలు తరచుగా రోజుకు 3000 నుంచి 5000 రూపాయల వరకు అమ్ముడవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా, బెండకాయ వంటి కూరగాయలకు మంచి ధర లభిస్తుందని గీతాదేవి తెలిపారు. టమాట ధర రూ.40కి పైగా పలుకుతుందని. తమ జిల్లాలో రైతులు టమాటా సాగు వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







