
మధ్యతరగతి, వేతన జీవులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చన్న అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిజం చేశారు. 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతే కాకుండా ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకృతం చేసేందుకు కొత్త చట్టాన్ని కూడా ఆయన ప్రకటించారు. వచ్చే వారం కొత్త బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పన్ను రహితం అని నిర్మలా సీతారామన్ ప్రకటించినందున, జీతం ఉన్నవారికి ఎంత పన్ను మినహాయింపు ఇస్తారు అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అంత సంపాదిస్తే పన్ను లేదు:
ఈ మునుపటి పన్ను విధానంలో 10 లక్షల వరకు రూ. 50,000 వరకు పన్ను కట్టాల్సి ఉండేది. ఇప్పుడు ప్రకటించినట్లుగా రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. దీంతో జీతాల వర్గానికి రూ.50 వేల లాభం పొందినట్లవుతుంది. గతంలో రూ.12 లక్షల వరకు ఆదాయానికి రూ.80,000 పన్ను ఉండేది. ఇప్పుడు జీరో ట్యాక్స్ ఉంది. ఆ విధంగా జీతం కేటగిరీ వారు 80,000 వరకు పొదుపు చేసుకోవచ్చు.
ఎంత పన్ను ఆదా? ఇదిగో లెక్క
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి