AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్‌.. అదేంటో తెలుసా?

మోదీ ప్రభుత్వం జులై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్‌ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్..

PM Modi: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్‌.. అదేంటో తెలుసా?
Pm Modi
Subhash Goud
|

Updated on: Jul 07, 2024 | 8:55 PM

Share

మోదీ ప్రభుత్వం జులై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్‌ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన గురించి పెద్ద అప్‌డేట్ వస్తోంది. ఒక నివేదిక ప్రకారం, ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవర్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బీమా కవరేజీ పరిమితి పెంపు

పీటీఐ నివేదిక ప్రకారం.. ఎన్డీయే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) కింద లబ్ధిదారుల సంఖ్యను, బీమా మొత్తాన్ని పెంచడాన్ని పరిశీలిస్తోంది. మూలాధారాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, లబ్ధిదారులకు ఇచ్చే హామీ మొత్తం పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ బీమా యోజన కింద వచ్చే మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌.. మైలేజీ ఎంతో తెలుసా?

వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై దృష్టి సారించవచ్చు. దీని వల్ల దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని పెద్ద సంఖ్యలో జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వెలుగులోకి రావడంతో వారికి చికిత్స కోసం భారీ ఉపశమనం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో చవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 150 రోజుల వ్యాలిడిటీ!

ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది

ఈ నెలాఖరులోగా జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బీమా రంగంలో ఈ భారీ నిర్ణయం ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.12,706 కోట్ల అదనపు భారం పడనుంది. 70 ఏళ్లు పైబడిన పౌరులతో సహా దాదాపు 4-5 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకంలో పాల్గొంటారని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..