PM Modi: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్‌.. అదేంటో తెలుసా?

మోదీ ప్రభుత్వం జులై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్‌ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్..

PM Modi: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్‌.. అదేంటో తెలుసా?
Pm Modi
Follow us

|

Updated on: Jul 07, 2024 | 8:55 PM

మోదీ ప్రభుత్వం జులై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్‌ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన గురించి పెద్ద అప్‌డేట్ వస్తోంది. ఒక నివేదిక ప్రకారం, ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవర్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బీమా కవరేజీ పరిమితి పెంపు

పీటీఐ నివేదిక ప్రకారం.. ఎన్డీయే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) కింద లబ్ధిదారుల సంఖ్యను, బీమా మొత్తాన్ని పెంచడాన్ని పరిశీలిస్తోంది. మూలాధారాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, లబ్ధిదారులకు ఇచ్చే హామీ మొత్తం పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ బీమా యోజన కింద వచ్చే మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌.. మైలేజీ ఎంతో తెలుసా?

వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై దృష్టి సారించవచ్చు. దీని వల్ల దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని పెద్ద సంఖ్యలో జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వెలుగులోకి రావడంతో వారికి చికిత్స కోసం భారీ ఉపశమనం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో చవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 150 రోజుల వ్యాలిడిటీ!

ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది

ఈ నెలాఖరులోగా జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బీమా రంగంలో ఈ భారీ నిర్ణయం ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.12,706 కోట్ల అదనపు భారం పడనుంది. 70 ఏళ్లు పైబడిన పౌరులతో సహా దాదాపు 4-5 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకంలో పాల్గొంటారని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..