Budget 2023: ఈ బడ్జెట్‌లో సామాన్యులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు..?

ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఎన్నో వరాలు లభించనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన పన్ను చెల్లింపుదారుల..

Budget 2023: ఈ బడ్జెట్‌లో సామాన్యులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు..?
Budget 2023-24

Updated on: Jan 27, 2023 | 1:47 PM

ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఎన్నో వరాలు లభించనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన పన్ను చెల్లింపుదారుల ఉత్సాహాన్ని పెంచింది. సామాన్యుల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని, తాను కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చానని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్‌లో దేశ ప్రజలకు వరాలు కురిపించే అవకాశం కనిపిస్తోంది. ధరల పెరుగుదల, ఉద్యోగాల కోత వంటి సమస్యలను మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నారు.

ఈ వార్షిక బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తలు, ఉద్యోగుల వరకు ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. ఎవరికి వారు తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తుండగా, ఫిబ్రవరి 1న ఎలాంటి ఉపశమనాలు వస్తాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1.50 లక్షల వరకు పెట్టుబడిపై 80C మినహాయింపు:

బడ్జెట్‌లో 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 80సి పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. బీమా, ఎఫ్‌డి, బాండ్లు, హోమ్ లోన్ ప్రిన్సిపల్, పిపిఎఫ్ వంటి పొదుపులు, పెట్టుబడి ఆప్షన్‌లు 80సి కింద వస్తాయి. ప్రస్తుతం 80సీ కింద రూ.1.50 లక్షల పెట్టుబడికి మినహాయింపు ఉంది. ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పెంచవచ్చు.

ఇవి కూడా చదవండి

గృహ రుణ తగ్గింపు:

ఈసారి గృహ కొనుగోలుదారులకు మినహాయింపు పరిధిని పెంచే అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారు రూ. 2 లక్షల వరకు గృహ రుణంపై చెల్లించే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచడం వల్ల తగ్గింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది.

ప్రామాణిక తగ్గింపు పరిమితి పెరగవచ్చు..

బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రభుత్వం పెంచవచ్చని కూడా బడ్జెట్‌లో భావిస్తున్నారు. 2019 సంవత్సరం నుండి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000గా ఉంటుంది. 1,00,000 వరకు ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. ప్రభుత్వం ఈ పరిమితిని పెంచవచ్చు.

బడ్జెట్ 2023 ద్వారా మార్కెట్‌లోని రిటైల్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (LTCG)లో ప్రభుత్వం ఉపశమనం అందిస్తుంది. ఈక్విటీపై ఎల్‌టీసీజీని తొలగించడం వల్ల ఈక్విటీలో పెట్టుబడి పెరుగుతుంది. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ. 1 లక్ష దాటితే, దానిపై 10% దీర్ఘకాలిక మూలధన లాభం విధించబడుతుంది. ఈసారి ప్రభుత్వం కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us