Kotak Securities: సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం.. కట్ చేస్తే..

Kotak Securities: ఒక చిన్నపాటి సాంకేతిక లోపంతో ఒక ట్రేడర్‌ అకౌంట్లో ఏకంగా 40 కోట్ల రూపాయల వరకు వచ్చి చేరాయి. పైగా 1.75 కోట్ల రూపాయల వరకు లాభం కూడా వచ్చింది. చివరకు ఇది బాంబే కోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయం స్థానం సంచలన తీర్పు ఇచ్చింది..

Kotak Securities: సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం.. కట్ చేస్తే..
Kotak Securities

Updated on: Jan 03, 2026 | 1:03 PM

Kotak Securities: ఒక టెక్నికల్‌ ఇష్యూ కారణంగా ఓ ట్రేడర్ అకౌంట్లో రూ.40 కోట్లు వచ్చి పడ్డాయి. ఆ డబ్బును అతడు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టగా 20 నిమిషాల్లో ఏకంగా రూ.1.75 కోట్ల లాభం వచ్చింది. అయితే అనుకోకుండా అతడి ఖాతాలో జమ అయిన తమ డబ్బుతో ట్రేడర్‌ లాభాలు పొందినట్లు ఆరోపిస్తూ.. కోటక్‌ సెక్యూరిటీస్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.

అయితే జరిగిన పొరపాటును గుర్తించిన కోటక్‌ సెక్యూరిటీస్‌.. ట్రేడర్‌ను సంప్రదించింది. డబ్బను వెనక్కి ఇవ్వాలని కోరింది. దీంతో కొంత కాలం తర్వాత అతడు కోటక్‌ నుంచి జమ అయిన రూ.40 కోట్లను తిరిగి ఇచ్చాడు. అయితే రూ.40 కోట్లతో పాటు వాటిని స్టాక్స్‌లో పెట్టి ఆర్జించిన రూ.1.75 కోట్ల లాభాన్ని కూడా తమకే ఇవ్వాలని కోటక్‌ డిమాండ్‌ చేసింది. లాభంగా పడిన ఈ డబ్బును తిరిగి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఈ వ్యవహారం బాంబే హైకోర్టకు చేరింది.

ఇది కూడా చదవండి: Gold and Silver Prices: మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..!

ఇవి కూడా చదవండి

బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన స్టాక్ మార్కెట్ కేసులో ఒక కీలక తీర్పును వెలువరించింది. తన బ్రోకరేజ్ హౌస్, కోటక్ సెక్యూరిటీస్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వ్యాపారికి రూ.1.75 కోట్ల లాభాలను నిలుపుకోవడానికి కోర్టు అనుమతించింది.

20 నిమిషాల్లో 1.75 కోట్లు:

2022లో వ్యాపారి గజానన్ రాజ్‌గురు ట్రేడింగ్ ఖాతాలో పొరపాటున రూ.40 కోట్లు (సుమారు $1.75 బిలియన్) మార్జిన్ జమ అయింది. కోటక్ సెక్యూరిటీస్‌లో జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ మొత్తం జోడించింది. ఈ అదనపు మార్జిన్‌ను ఉపయోగించి వ్యాపారి దాదాపు 20 నిమిషాల్లో F&O ట్రేడ్‌ను అమలు చేసి, రూ.1.75 కోట్ల (సుమారు $1.75 బిలియన్) లాభాన్ని ఆర్జించాడు. ఈ కేసులో కోటక్ సెక్యూరిటీస్ మొత్తం ప్రక్రియలో ఎటువంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యాపారి లాభాలను తన స్వంత అవగాహన, రిస్క్ తీసుకోవడం ద్వారా ఆర్జించాడని, మోసం ద్వారా కాదని తెలిపింది. అందుకే దీనిని “అన్యాయమైన ప్రయోజనం” అని పిలవడం తప్పు అని పేర్కొంది.

ఇది కూడా చదవండి: School Holidays: ఇక్కడ జనవరి 5 వరకు పాఠశాలలు బంద్‌.. సీఎం కీలక ప్రకటన!

ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రేడర్‌ సొంత రిస్క్‌పై స్టాక్స్‌లో పెట్టినందువల్ల లాభం కూడా అతడికే సొంతమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణలో భాగంగా ట్రేడర్‌ తమ డబ్బుతో సంపాదించిన మొత్తాన్ని తమకు ఇచ్చేస్తే అతడికి రూ.50 లక్షలు ఇస్తామని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఆఫర్‌ ఇవ్వగా అందుకు అతడు తిరస్కరించాడు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా వేస్తున్నట్లు బాంబే హైకోర్టు తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us