AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: అధికారంలోకి వస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.75.. ఎన్నికల ముందు భారీ ప్రకటన

ఎన్నికల హోరు పెరిగింది. దేశంలోని పెద్ద పార్టీలన్నీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దక్షిణ భారతదేశంలో పర్యటించి తన స్థానాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ తన మేనిఫెస్టోలో అలాంటి ప్రకటనలు చేసింది. ఇది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. డీఎంకే పార్టీ..

Petrol Price: అధికారంలోకి వస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.75.. ఎన్నికల ముందు భారీ ప్రకటన
Petrol
Subhash Goud
|

Updated on: Mar 20, 2024 | 6:58 PM

Share

ఎన్నికల హోరు పెరిగింది. దేశంలోని పెద్ద పార్టీలన్నీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దక్షిణ భారతదేశంలో పర్యటించి తన స్థానాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ తన మేనిఫెస్టోలో అలాంటి ప్రకటనలు చేసింది. ఇది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. డీఎంకే పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ప్రకటన చేసింది. తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే, తమిళనాడులో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించనంతగా తగ్గుతాయని డీఎంకే తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.

డీఎంకే తన మ్యానిఫెస్టోలో పెట్రోల్ ధర రూ.75కి, డీజిల్ ధర రూ.65కి తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది ఎవరికైనా షాక్ ఇచ్చే ప్రకటన. అంటే రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే పెట్రోల్ ధర లీటరుకు 25 రూపాయల కంటే ఎక్కువ తగ్గుతుంది. డీజిల్ ధరలో రూ.27 కంటే ఎక్కువ తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద మెట్రోల్లో ఒకటైన, తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.75 కాగా, డీజిల్ ధర రూ.92.34గా ఉంది.

ఇటీవల రూ.2 తగ్గింది

ఇవి కూడా చదవండి

దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలోని పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత చెన్నై సహా దేశంలోని అన్ని మెట్రోల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అంతకుముందు, ఏప్రిల్ 2022లో పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చాయి. ఆ తర్వాత మే నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నును తగ్గించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర దాదాపు 87 డాలర్లుగా ఉంది.

గ్యాస్ సిలిండర్ కూడా చౌక

మరోవైపు తమిళనాడుకు చెందిన డీఎంకే కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించింది. పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి కుటుంబానికి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ప్రస్తుతం చెన్నై వంటి మహానగరంలో నాన్ సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.818.50 ఉంది. అంటే చెన్నైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.318 వరకు తగ్గుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గింది. అంతకు ముందు ఆగస్టు చివరి రోజుల్లో రూ.200 కోత పెట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి