బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. మే 2022 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పదే పదే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. మే నుంచి ఆర్బీఐ రెపో రేటును మొత్తం 190 బేసిస్ పాయింట్లు పెంచింది. చాలా మంది రుణదాతలు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నారు. సెప్టెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా మందికి మంచి పెట్టుబడి ఎంపిక. మీరు కూడా రాబోయే రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఏ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల పీఫ్డీపై ఉత్తమ వడ్డీ రేటును పొందుతారో తెలుసుకోండి.
ఇది కాకుండా ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పోస్టాఫీసులో ఆన్లైన్లో ఎఫ్డీ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం మీరు పోస్టాఫీసుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ లాగానే పోస్టాఫీసు కూడా మీకు ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ సౌకర్యం కల్పిస్తుంది. పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు అంటారు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది, అయితే త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లో ఒక సంవత్సరం పాటు డబ్బును ఫిక్స్ చేస్తే, మీకు 5.50% చొప్పున వడ్డీ ఇవ్వబడుతుంది.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి