AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha Will Adjourn : రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు..! ఫిబ్రవరి 13నే ముగిసే ఛాన్స్..

రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగాయని తెలుస్తోంది. బడ్జెట్​ సమావేశాల్లోని తొలి సెషన్​లో రాజ్యసభ కార్యకలాపాలు 13నే ముగుస్తాయని పెద్దలసభ వర్గాలు తెలిపాయి...

Rajya Sabha Will Adjourn : రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు..! ఫిబ్రవరి 13నే ముగిసే ఛాన్స్..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:30 PM

Share

Rajya Sabha Will Adjourn : రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగాయని తెలుస్తోంది. బడ్జెట్​ సమావేశాల్లోని తొలి సెషన్​లో రాజ్యసభ కార్యకలాపాలు 13నే ముగుస్తాయని పెద్దలసభ వర్గాలు తెలిపాయి. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్​లో మార్పులు చేసినట్లు తెలిపాయి.

ఫిబ్రవరి 15కు బదులు 13న సభ నిర్వహించాలన్న ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచన మేరకు మార్పులు చేసినట్లు అధికారిక వర్గాల అంటున్నాయి. ఇదే విషయంపై అఖిలపక్షం సమావేశంలో కూడా చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్​పై జరిగే చర్చల్లో సభ్యులంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అఖిలపక్ష భేటీలో రాజ్యసభ ఛైర్మన్.. నేతలను కోరినట్లుగా తెలుస్తోంది. ప్రతి అంశంపై సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని అఖిలపక్ష సమావేశంలో ఛైర్మన్ స్పష్టం చేశారని రాజ్యసభ వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్​ ప్రకారం.. శని, ఆదివారాలు సభా కర్యకలాపాలు జరగవు. అయితే ఫిబ్రవరి 15నే రాజ్యసభను ముగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..