సాక్ష్యాలు కావాలా? బాలాకోట్ వెళ్లి చూస్కోండి: రాజ్యవర్ధన్ రాథోర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్స్పై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్కు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదటి కపలి సిబాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ పాకిస్థాన్లో బీజేపీ ప్రభుత్వం చేశామని చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్లో ఎంతమంది […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్స్పై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్కు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మొదటి కపలి సిబాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ పాకిస్థాన్లో బీజేపీ ప్రభుత్వం చేశామని చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్లో ఎంతమంది చనిపోయారో ఆధారాలు లేవని అన్నారు. ఇందుకు ఆయన పలు అంతర్జాతీయ పత్రికలను ఉటంకిస్తూ ఏవీ కూడా మిలిటెంట్లు చనిపోయినట్టు చెప్పలేదని అన్నారు.
దీనికి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సమాధానమిస్తూ మన ఇంటెలిజెన్స్ కన్నా మీరు అంతర్జాతీయ మీడియాను నమ్ముతున్నారు. స్ట్రైక్స్ వల్ల ఏమీ జరగలేదని మీడియా చెబితే మాకు సంతోషంగా ఉన్నట్టుంది. ఈవిఎంల విషయంలో సాక్ష్యాల కోసం మీరు లండన్ వెళ్లినట్టుగానే స్ట్రైక్స్ విషయంలో జరిగిన దాడికి సాక్ష్యాల కోసం బాలాకోట్ వెళ్లండి అని సూచించారు.
Kapil Sibal ji:
You believe international media over own Intelligence agencies?
You seem happy when media quoted by you says “no losses in strike”?
..and sir, for us you went to london??♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) March 5, 2019