ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

|

Apr 30, 2020 | 7:52 PM

40 రోజులుగా ఒకే గదిలో.. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది.. ఎంతటి చిత్రహింసలు అనుభవిస్తున్నారో ఒక్కసారి ఊహించండి. లాక్ టన్ కారణంగా మహారాష్ట్రలో తెలుగు యువకులు పడుతున్న పాట్లు ఇవి.

ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం
Follow us on

40 రోజులుగా ఒకే గదిలో.. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది.. ఎంతటి చిత్రహింసలు అనుభవిస్తున్నారో ఒక్కసారి ఊహించండి. లాక్ టన్ కారణంగా మహారాష్ట్రలో తెలుగు యువకులు పడుతున్న పాట్లు ఇవి. మొత్తం 500 మంది.. ఒక్కో రూముకు 40, 50 మంది లాక్‌డౌన్ కారణంగా తెలుగు యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో తెలుగు యువకులు చిక్కుకుపోయారు. తాజాగా వీరి విషయం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది.

కడప జిల్లాకు చెందిన 500 మంది యువకులు ఉద్యోగాల వలలో చిక్కుకున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరిట ఆహ్వానం 500 మందిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ చేర్చింది. ఉద్యోగం సంగతి పక్కన పెడితే లాక్‌డౌన్ నేపథ్యంలో గత నలభై రోజులుగా వీరంతా సమస్యలు పడుతున్నారు. నరకం అనుభవిస్తున్నారు. సుమారు 40 మంది ఒక్కో రూంలో ఉండిపోయారు. అయినప్పటికీ ఆ రూమ్ రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు తాగడానికి నీళ్లు లేక అవస్థల పాలవుతున్నారు. తిండి అయితే ప్రభుత్వం పెడుతున్నా.. రూం రెంటుకు మాత్రం ఒత్తిడులు తీవ్రమవుతుందని వారు చెబుతున్నారు.

తమ దీనావస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలపాలంటూ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేసి పంపిస్తున్నారు. ఆదాయం లేక కనీసం రూమ్ రెంట్ కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైనా చొరవ చూపించి తమ తమ సొంత ప్రాంతాలకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఎక్కువ మంది కడప జిల్లాకు చెందిన వారుండగా.. తెలంగాణకు చెందిన వారు కూడా కొంత మంది వున్నారని తెలుస్తోంది. తమకు తమ స్వస్థలాలకు చేర్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

 

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు