AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్‌కు వివరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్.. గవర్నర్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ […]

బ్రేకింగ్:  ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Oct 17, 2019 | 8:33 PM

Share

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్‌కు వివరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్.. గవర్నర్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ అయ్యారు. రేపు( శుక్రవారం) ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే అక్టోబర్ 5న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని, సమ్మెకు దిగిన 48 వేలమంది కార్మికులు తమ ఉద్యోగులు కాదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ మహేశ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం మరో కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. ఇప్పటికే సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం హైకోర్టు ఇరు వర్గాలకు మొట్టికాయలు వేసింది. సమ్మెలతో ప్రజలను ఇబ్బంది పెట్టవందంటూ కార్మిక సంఘాలకు చెబుతూనే.. చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. దీంతో శుక్రవారం కోర్టు వాయిదా ఉన్నందున ప్రభుత్వం తన వాదన వినిపించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే గవర్నర్ తమిళసై రెండు రోజుల క్రితం ఉన్నపాటుగా ఢిల్లీ పయనమై రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఒక నివేదిక అందించారు.