AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఈ రోజు కొత్తగా 5,975 కరోనా కేసులు

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,975 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,385కి, మరణాల సంఖ్య 6,517కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5,603 మంది కరోనా నుంచి..

తమిళనాడులో ఈ రోజు కొత్తగా 5,975 కరోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2020 | 6:57 PM

Share

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వంద మందికిపైగా మరణిస్తున్నారు.

తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,975 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,385కి, మరణాల సంఖ్య 6,517కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5,603 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,13,280 మంది కోలుకోగా, ప్రస్తుతం 53,710 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Also Read:

కోవిడ్ పేషెంట్స్ శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు