అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు
చెన్నైలోని కడలూరు జిల్లాలో సినిమాను తలదన్నేలా ఓ అర్చకుడి క్రైమ్ కథ తాజాగా వెలుగు చూసింది. బండ్రుట్టిలో వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడిగా గోపినాథ్(50) అనే వ్యక్తి ఉంటున్నాడు. గోపినాథ్ జాతకాలు చెబుతూ స్థానికంగా తనకు పరిచయమున్న మంజులతో..
చెన్నైలోని కడలూరు జిల్లాలో సినిమాను తలదన్నేలా ఓ అర్చకుడి క్రైమ్ కథ తాజాగా వెలుగు చూసింది. బండ్రుట్టిలో వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడిగా గోపినాథ్(50) అనే వ్యక్తి ఉంటున్నాడు. గోపినాథ్ జాతకాలు చెబుతూ స్థానికంగా తనకు పరిచయమున్న మంజులతో.. అర్చకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పడైవీటిఅమ్మాన్ కాలనీలో మంజుల ఆమె భర్త కణ్ణదాసన్ నివాసముంటున్నారు.
అయితే మంజుల విషయంలో గోపినాథ్ని మందలించాడన్న కారణంగా.. మంజుల భర్త కణ్ణదాసన్ని హత్య చేశాడు అర్చకుడు. అయితే ఆ మృత దేహం ఎవరికంటా పడకుండా వేణుగోపాలస్వామి ఆలయంలోని స్వామి పక్కనే ఉన్న గదిలో పూడ్చిపెట్టాడు. కాగా కణ్ణదాసన్ నాలుగు రోజులుగ్గా కనబడుటలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో మంజుల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గోపినాథ్, మంజుల కోసం కణ్ణదాసన్ని చంపి ఎవరికీ తెలియకుండా ఆలయంలోనే పూడ్చి పెట్టాడని పోలీసులు వివరించారు. ప్రస్తుతం అర్చకుడు గోపినాథ్ని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా ఒక మహిళ కోసం ఒక వ్యక్తిని హత్య చేసి.. పవిత్రమైన ఆలయంలో పూడ్చి పెట్టిన అర్చకుడు విషయం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైనది.
Read More:
ఖైరతాబాద్లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ