కోవిడ్ పేషెంట్స్ శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
కోవిడ్ మహమ్మారి మృతుల పోస్టుమార్టమ్ నివేదికల ద్వారా పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశామని పేర్కొన్నారు లండన్కు చెందిన శాస్త్రవేత్తలు. కరోనా కారణంగా మృతి చెందిన వారిలో ఊపిరితిత్తులో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని..
కోవిడ్ మహమ్మారి మృతుల పోస్టుమార్టమ్ నివేదికల ద్వారా పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశామని పేర్కొన్నారు లండన్కు చెందిన శాస్త్రవేత్తలు. కరోనా కారణంగా మృతి చెందిన వారిలో ఊపిరితిత్తులో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని వారు వెల్లడించారు. వారు నిర్వహించిన పది పోస్టు మార్టాల్లో చనిపోయిన వారందరికీ ఊపిరితిత్తుల్లో గాయాలున్నాయని, ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు. దాదాపు 9 మందిలో ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని అధ్యయన నిపుణులు తెలిపారు.
ఈ మేరకు ఓ నివేదికను ఇంపీరియల్ కాలేజ్ వెబ్ సైట్లో ప్రచురించారు. తాము కనుగొన్న ఈ వివరాల ద్వారా కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్ తిన్నర్స్ను ఉపయోగించడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని చెప్పారు. ఇలాంటి పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సరైన చికిత్స అందించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు నిపుణులు.
Read More:
వాట్సాప్లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్కట్తో పాటు!
ఖైరతాబాద్లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ