AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జికల్ స్ట్రయిక్‌పై మోడీ తొలి స్పందన

రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికోద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చేసిన దాడిపై స్పందించారు. ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజని ప్రధాని మోడీ అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న నమ్మకాన్ని ఇస్తున్నాను. భారత్ ఎవరికీ భయపడదు. ఈ గడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నా.. భారత్‌కు హాని చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. ఈ దేశాన్ని తల దించుకోనివ్వను. […]

సర్జికల్ స్ట్రయిక్‌పై మోడీ తొలి స్పందన
Vijay K
|

Updated on: Feb 26, 2019 | 2:50 PM

Share

రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికోద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చేసిన దాడిపై స్పందించారు.

ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజని ప్రధాని మోడీ అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న నమ్మకాన్ని ఇస్తున్నాను. భారత్ ఎవరికీ భయపడదు. ఈ గడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నా.. భారత్‌కు హాని చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. ఈ దేశాన్ని తల దించుకోనివ్వను. ఈ రోజు భారత అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన రోజు. భారత‌ ప్రయాణానికి ఎవరినీ అడ్డుపడనివ్వను. సైనిక సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకున్నాం అని ప్రధాని మోడీ అన్నారు.

దేశం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నేను సెల్యూట్ చేస్తున్నానని మోడీ అన్నారు. మోడీ మాట్లాడిన స్టేజ్‌పై పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్ల ఫొటోలను ప్రదర్శించారు. మోడీ మాట్లాడుతున్నంత సేపు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు దద్దరిల్లాయి.