AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పంజా.. నవ దంపతులతో సహా 43 మందికి పాజిటివ్

దేశంలో ఓ వైపు కరోనా పంజా విసురుతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కారణంగా వైరస్ మరింత వేగంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లిళ్లు, పండగలు, ఉత్సవాలు, వేడుకలు అన్ని సాదాసీదాగా జరుపుకుంటున్న క్రమంలో కొంతమంది నిబంధనలు పక్కకు నెట్టేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలకు కుటుంబాలు వైరస్ బారిన పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళలోని కాసరగోడ్ జిల్లా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. చెంగల గ్రామంలో ఘనంగా నిర్వహించిన వివాహ […]

కరోనా పంజా.. నవ దంపతులతో సహా 43 మందికి పాజిటివ్
Sanjay Kasula
|

Updated on: Jul 26, 2020 | 8:43 AM

Share

దేశంలో ఓ వైపు కరోనా పంజా విసురుతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కారణంగా వైరస్ మరింత వేగంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లిళ్లు, పండగలు, ఉత్సవాలు, వేడుకలు అన్ని సాదాసీదాగా జరుపుకుంటున్న క్రమంలో కొంతమంది నిబంధనలు పక్కకు నెట్టేస్తున్నారు.

ఫలితంగా కుటుంబాలకు కుటుంబాలు వైరస్ బారిన పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళలోని కాసరగోడ్ జిల్లా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. చెంగల గ్రామంలో ఘనంగా నిర్వహించిన వివాహ వేడుక అనంతరం కరోనా కలకలం రేపింది.

ముందుగా కరోనా లక్షణాలతో ఆ కుటుంబ పెద్ద ఆస్పత్రిలో చేరాడు. అనంతరం అతనికి కొవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ గా తేలింది. అయితే అనుమానంతో ఆ వివాహానికి వచ్చిన వంద మందిని పరీక్షించడంతో వారిలో 42 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. నవ దంపతులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వివాహం జరిగిన చెంగల గ్రామ పంచాయతీని హాట్ స్పాట్ గా గుర్తించారు. పెళ్లికి హాజరైన అన్ని కుటుంబాలను 14 రోజుల పాటు క్వారైంటన్ చేశారు.