అమెరికాలో కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలి

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:30 PM

అమెరికాలోని ఫ్లొరిడాలో మరోసారి గన్ పేలింది. తెలంగాణకు చెందిన కొత్త గోవర్థన్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపేశారు. ఫ్లొరిడాలోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు గోవర్థన్ రెడ్డి. ఆయన స్టోర్లో ఉండగా చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. గోవర్థన్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపైనా కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో గోవర్థన్ స్పాట్లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం […]

అమెరికాలో కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలి
Follow us on

అమెరికాలోని ఫ్లొరిడాలో మరోసారి గన్ పేలింది. తెలంగాణకు చెందిన కొత్త గోవర్థన్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపేశారు. ఫ్లొరిడాలోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు గోవర్థన్ రెడ్డి. ఆయన స్టోర్లో ఉండగా చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. గోవర్థన్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపైనా కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో గోవర్థన్ స్పాట్లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది.

గోవర్థన్ రెడ్డి డెడ్ బాడీని ఫ్లోరిడాలోని మార్చురీలో భద్రపరిచారు. డెడ్ బాడీని స్వస్థలానికి తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆయన కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు గోవర్థన్ రెడ్డి. ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు హైదరాబాద్ లోని ఉప్పల్లో నివాసముంటున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలువిలిసేలా రోధిస్తున్నారు. గోవర్థన్ రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి.