AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారులకు కేసీఆర్ షాక్… అందరు అక్కడికెళ్ళాల్సిందే!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర స్థాయి అధికారులకు షాకిచ్చారు. ఈ మేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ప్రయత్నంలో కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అధికారులకు కేసీఆర్ షాక్... అందరు అక్కడికెళ్ళాల్సిందే!
Rajesh Sharma
|

Updated on: Apr 21, 2020 | 6:37 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర స్థాయి అధికారులకు షాకిచ్చారు. ఈ మేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ప్రయత్నంలో కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.