AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయలసీమకు జగన్ తీరని ద్రోహం.. ‘కాలువ‘ మాటేంటంటే?

రెండు బెంచ్‌లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేసి అవశేష హైకోర్టును కర్నూలుకు ఇస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు. రాయలసీమ వాసి అయిన జగన్ ఈ ప్రాంత వాసులను విస్మరిస్తున్నారని అన్నారాయన. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ వాసులకు ముఖ్యమంత్రి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని, దీనిపై వైసీపీ సీమ నేతలు స్పందించాలని కాలువ డిమాండ్ చేశారు. […]

రాయలసీమకు జగన్ తీరని ద్రోహం.. ‘కాలువ‘ మాటేంటంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 23, 2019 | 2:33 PM

Share

రెండు బెంచ్‌లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేసి అవశేష హైకోర్టును కర్నూలుకు ఇస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు. రాయలసీమ వాసి అయిన జగన్ ఈ ప్రాంత వాసులను విస్మరిస్తున్నారని అన్నారాయన. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ వాసులకు ముఖ్యమంత్రి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని, దీనిపై వైసీపీ సీమ నేతలు స్పందించాలని కాలువ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు ముక్కలు చేసిన ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం వలన సీమ వాసులకు ఒరిగే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. అవశేష హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం వలన ఎంత మంది సీమవాసులకు ఉద్యోగాలు వస్తాయని అడిగారు కాలువ. విశాఖపట్నం రాయలసీమ వాసులకు చాలా దూరంలో ఉందని అన్నారాయన.

అమరావతే దూరం అనుకుంటే అంత కంటే దూరంలోని వున్న విశాఖలో రాజధాని పెడతామంటున్నారని అన్నారు కాలువ శ్రీనివాసులు. సామాన్య ప్రజలు అంత దూరం ఎలా వెళతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖపట్నం వాసులు కూడా ఇక్కడ ఏం చేస్తారోనని భయపడుతున్నారని, మూడు రాజధానులన్నది ప్రగతి నిరోధక చర్య అని కాలువ అంటున్నారు. సీఎం జగన్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, గతంలో అమరావతి రాజధానికి విపక్ష నేతగా జగన్ అసెంబ్లీలోనే ఒకే చెప్పారని కాలువ కామెంట్ చేశారు.

రాజధాని నిర్మాణానికి కనీసం 30వేల ఎకరాలు అవసరం అన్న జగన్ ఇప్పుడు జీఎన్ రావు కమిటీ ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిలో భవనాలు శాశ్వతం అన్నది మరచి పోవద్దని సూచిస్తున్న కాలువ శ్రీనివాసులు… మే 27న జరిగే కేబినెట్ భేటీలో అయినా రాజధానిపై ఏర్పడిన గందరగోళానికి తెరదించాలని డిమాండ్ చేశారు.

Follow Us
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!