ఐటీ గ్రిడ్ కేసు: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు
ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఓ వైపు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంటూ మరోవైపు కేసుల నమోదు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు జడ్జి ముందుకు హాజరు అయ్యారు. వారితో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులను అక్రమంగా నిర్భందించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. […]
ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఓ వైపు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంటూ మరోవైపు కేసుల నమోదు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు జడ్జి ముందుకు హాజరు అయ్యారు. వారితో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులను అక్రమంగా నిర్భందించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. కాగా సేవామిత్ర పేరుతో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పౌరుల డేటాను చోరీ చేసిందంటూ రామ్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.