AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత, సాంప్రదాయాలు తెలిస్తే..

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి సంస్కృతి, పండుగలు ప్రకృతితో, భూమాతతో ముడిపడి ఉంటాయి. అటువంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. రైతులు తమ వ్యవసాయ పనులను అధికారికంగా ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఏరు అంటే నాగలి సాగే దారి లేదా నీటి ప్రవాహం అని, వాక అంటే ప్రారంభం అని అర్థం. అంటే నాగలిని భూమిలో దించి వ్యవసాయాన్ని మొదలుపెట్టే రోజే ఈ ఏరువాక పౌర్ణమి. మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం..

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత, సాంప్రదాయాలు తెలిస్తే..
Eruvaka Purnima 2026
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2026 | 9:57 AM

Share

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి సంస్కృతి, పండుగలు ప్రకృతితో, భూమాతతో ముడిపడి ఉంటాయి. అటువంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. రైతులు తమ వ్యవసాయ పనులను అధికారికంగా ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఏరు అంటే నాగలి సాగే దారి లేదా నీటి ప్రవాహం అని, వాక అంటే ప్రారంభం అని అర్థం. అంటే నాగలిని భూమిలో దించి వ్యవసాయాన్ని మొదలుపెట్టే రోజే ఈ ఏరువాక పౌర్ణమి.

ఆధ్యాత్మిక, సాంప్రదాయ ప్రాముఖ్యత:

ఈ పండుగ వెనుక ఎంతో వైశిష్ట్యం ఉంది. మృగశిర కార్తె ప్రవేశించి, ముసురు వర్షాలు కురిసే కాలం ఇది. కొత్తగా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు భూమిని పూజించడం మన సాంప్రదాయం. ఈ రోజున రైతులు ఉదయాన్నే లేచి ఇళ్లను, పశువుల పాకలను శుభ్రం చేసుకుంటారు. వర్షాలను ప్రసాదించే ఇంద్ర దేవుడిని, పంటలను ఇచ్చే భూమాతను భక్తితో ప్రార్థిస్తారు. తాము చేసే వ్యవసాయం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగాలని, ఊరంతా పాడిపంటలతో విలసిల్లాలని కోరుకుంటారు.

పశువుల పూజ, వేడుకలు:

ఏరువాక పౌర్ణమి రోజున రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎడ్లను చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, అందమైన వస్త్రాలతో ముస్తాబు చేస్తారు. నాగలిని, కాడిని పూజించి, పశువులకు నైవేద్యంగా కుడుములు, చలిమిడి, బెల్లం వంటివి తినిపిస్తారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఎడ్లను గ్రామంలో ఊరేగిస్తూ ఏరువాక సాగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజున పొలాల్లో విత్తనాలు చల్లడం లేదా తొలి దుక్కి దున్నడం శుభపరిణామంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ పౌర్ణమిని కృషి పూర్ణిమ అని, ఉత్తర భారతదేశంలో వట సావిత్రి వ్రతంగా కూడా జరుపుకుంటారు. కాయకష్టాన్ని నమ్ముకుని, జగత్తుకు అన్నం పెట్టే రైతన్న ప్రకృతిని, పశుగణాన్ని దైవంగా భావించి జరుపుకునే కృతజ్ఞతా పండుగ ఏరువాక. ఆధునిక కాలంలో యంత్రాలు వచ్చినప్పటికీ, మట్టిని, పశువులను పూజించే ఈ మధురమైన సాంప్రదాయం గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా రైతాంగానికి, ప్రజలందరికీ పాడిపంటలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిద్దాం!

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us