టీడీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 18, 2020 | 7:23 PM

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్‌ చెప్పారు. గతంలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తన […]

టీడీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్‌ చెప్పారు.

గతంలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్‌‌ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu