AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ ఆటలో కత్తిపోట్లు.. “ఢీ అంటే ఢీ”

క్రికెట్‌ మైదానం ఘర్షణలకు వేదికగా మారింది. ఒకేరోజు రెండు జిల్లాల్లో క్రికెట్‌ మైదానాల్లో ఘర్షణలు జరగడం కలకలం రేపింది. అటు విశాఖ జిల్లాలో కత్తిపోట్లకు దారి తీయగా, ఇటు ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలకు చెందిన యువకులు బ్యాట్లు, స్టంప్స్‌ కర్రలతో దాడికి దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులోని కాలేజీ క్రికెట్‌ మైదానంలో జరిగిన ఓ వివాదం కత్తిపోట్లకు దారి తీసింది.  మూలపేటకు చెందిన సాయి, శారదానగర్‌కు చెందిన సూర్య క్రికెట్ ఆడేందుకు ఈనెల […]

క్రికెట్ ఆటలో కత్తిపోట్లు.. ఢీ అంటే ఢీ
Sanjay Kasula
|

Updated on: Jun 05, 2020 | 8:40 AM

Share

క్రికెట్‌ మైదానం ఘర్షణలకు వేదికగా మారింది. ఒకేరోజు రెండు జిల్లాల్లో క్రికెట్‌ మైదానాల్లో ఘర్షణలు జరగడం కలకలం రేపింది. అటు విశాఖ జిల్లాలో కత్తిపోట్లకు దారి తీయగా, ఇటు ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలకు చెందిన యువకులు బ్యాట్లు, స్టంప్స్‌ కర్రలతో దాడికి దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులోని కాలేజీ క్రికెట్‌ మైదానంలో జరిగిన ఓ వివాదం కత్తిపోట్లకు దారి తీసింది.  మూలపేటకు చెందిన సాయి, శారదానగర్‌కు చెందిన సూర్య క్రికెట్ ఆడేందుకు ఈనెల 2న కొత్తూరులోని గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడారు. అక్కడ ఓ విషయంలో వివాదం చెలరేగింది. అయితే సహచరులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే సాయిపై కక్ష గట్టిన సూర్య…మరుసటి రోజు అదే గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతున్న సాయిపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో సాయికి నుదురు, దవడ, ముక్కుతో పాటు అయిదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా ఓ క్రికెట్‌ మైదానంలో ఘర్షణ చెలరేగింది. కొండపి మండలం నేతివారిపాలెంలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గ్రౌండ్‌ను బాగు చేసుకుని ఓ వర్గం క్రికెట్‌ ఆడుతుండగా, మరో వర్గం యువకులు కూడా అదే గ్రౌండ్‌లోకి ఆడుకునేందుకు రావడంతో గొడవ మొదలైంది. ఓ వర్గానికి చెందిన వారు బ్యాట్‌లు, స్టంప్స్‌ కర్రలతో మరో వర్గానికి చెందిన యువకులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఇద్దరికి తలలు పగిలాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకులు, దాడికి గురైన యువకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయితే క్రికెట్‌ ఆడే విషయంలో గ్రూపులు కట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల వెనుక గ్రూపు తగాదాలు ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

Follow Us
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్