ఢిల్లీలో లక్షా 17 వేలకు చేరువలో కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో నేడు 1600కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా17వేలకు చేరువైంది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,647పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇక్కరోజే 41 మంది కరోనా బారినపడి మరణించారు.

ఢిల్లీలో లక్షా 17 వేలకు చేరువలో కరోనా కేసులు
Follow us

|

Updated on: Jul 15, 2020 | 9:30 PM

కరోనా మహమ్మారి దేశ రాజధానిని వణికిస్తోంది. బుధవారం నమోదైన కరోనా కేసులు ఢిల్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు 1600కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా17వేలకు చేరువైంది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,647పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇక్కరోజే 41 మంది కరోనా బారినపడి మరణించారు. ఇప్పటివరకు 95,699 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,16,993కి చేరింది. కాగా, ఇప్పటివరకు 3,487మంది మృత్యువాతపడ్డారు.