AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. భారత్-చైనా మధ్య ఘర్షణ.. సైనికాధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి

భారత-చైనా మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. నిన్న లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో ఉభయ దేశాల సైనిక దళాలు ఎదురుపడగా..

బ్రేకింగ్.. భారత్-చైనా మధ్య ఘర్షణ.. సైనికాధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 2:45 PM

Share

భారత-చైనా మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. నిన్న లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో ఉభయ దేశాల సైనిక దళాలు ఎదురుపడగా హఠాత్తుగా చైనా సైనికులు జరిపిన దాడి ల్లో ఓ భారత సైనికాధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు.అయితే ఈ ఘర్షణలో ఉభయ దళాల మధ్య రాళ్ళ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితిని నివారించేందుకు రెండు దేశాల సైనికాధికారులు చర్చలు ప్రారంభించినట్టు సమాచారం.

నిజానికి గాల్వాన్ వ్యాలీలో ఉద్రిక్థతల నివారణకు రెండు దేశాలూ ప్రయత్నిస్తుండగా.. ఈ హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఉభయ దేశాల సైనికులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారని, ఈ ఘర్షణలో భారత కల్నల్ స్థాయి అధికారి సహా ఇద్దరు జవాన్లు మృతి చెంద్రని, అదే సమయంలో చైనా దళాల్లో లోకూడా కొంతమంది గాయపడడమో, మరణించడమో జరిగిందని సమాచారం. గాల్వాన్ వ్యాలీలోని పాంగాంగ్ సో, డెమ్ చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ కొన్ని వారాలుగా భారత్..చైనా సైనికుల మధ్య ఉద్రిక్థత కొనసాగుతోంది. పాంగాంగ్ సో తో బాటు పలు డీ-ఫ్యాక్టో బోర్డర్స్ లో.. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు ముందుకు చొచ్ఛుకువచ్చాయి.

చర్చలు జరిగినప్పటికీ పాంగాంగ్ సరస్సు వద్ద గస్తీ తిరుగుతున్న రెండు దేశాల సైనికులూ ఒక దశలో పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఈ నెల 6 న ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య మళ్ళీ  చర్చలు జరిగిన దరిమిలా.. గాల్వాన్ ప్రాంతంలో చైనా సైన్యం కొంత వెనక్కి తగ్గగా.. భారత ఆర్మీ కూడా తన సైనిక వాహనాలతో బాటు తిరిగి వెనక్కి మళ్లింది.