AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో హై టెన్ష‌న్..‘మర్కజ్ ప్రార్థనల’కు భారీగా వెళ్లిన జనం

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా.. ఇప్పుడు ప్రభుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్య‌లో తెలుగువారు వెల్లిన‌ట్టు తెలియ‌డంతో అధికారులు అల‌ర్టయ్యారు. అక్క‌డికి వెళ్లిన‌వారితో పాటు వారితో స‌న్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ నుంచి 280 మంది […]

తెలుగు రాష్ట్రాల్లో హై టెన్ష‌న్..‘మర్కజ్ ప్రార్థనల’కు భారీగా వెళ్లిన జనం
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 9:31 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా.. ఇప్పుడు ప్రభుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్య‌లో తెలుగువారు వెల్లిన‌ట్టు తెలియ‌డంతో అధికారులు అల‌ర్టయ్యారు. అక్క‌డికి వెళ్లిన‌వారితో పాటు వారితో స‌న్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ నుంచి 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది.

అందుతోన్న ప్ర‌కారం తెలంగాణ నుంచి ప్రాంతాల వారీగా మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారు:

హైదరాబాద్ 186 మెదక్ 26 వరంగల్ 25 నల్గొండ 21 నిజామాబాద్ 18 కరీంనగర్ 17 రంగారెడ్డి 15 ఖమ్మం 15 నిర్మల్ 11 భైంసా 11 ఆదిలాబాద్ 10

కాగా ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన‌వారు వెంట‌నే తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంవో కోరింది. వారికి ఉచితంగా టెస్టుల చేయించి, వైద్య సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. అందులో ఇత‌ర దేశాల‌కు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రేయ‌ర్స్ లో పాల్గొన్నారు.

మ‌రోవైపు ప్రార్థ‌న‌ల కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారిలో ఏపీకి చెందినవారు 711 మంది ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. 13 జిల్లాల నుంచి కూడా భ‌క్తుల అక్కడికి వెళ్లిన‌ట్టు స‌మాచారం. కొన్ని జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసులకు మూలాలు దిల్లీ వెళ్ళొచ్చిన వారేనని అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. వీరిలో ఆస్ప‌త్రి క్వారంటైన్ లో 122 మంది, ప్రభుత్వ క్వారంటైన్ లలో మరో 207 మంది ఉన్నారు.హోమ్ క్వారంటైన్ లో మరో 297 మంది ఉన్నారు. ఇంకా ఆచూకీ తెలియని 85 మంది.. డేటాను సేకరిస్తున్న పోలీసులు, వైద్యాధికారులు సేక‌రిస్తున్నారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు