AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : హౌస్‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్.. అద్దాలగదికే పరిమితం చేసిన బిగ్ బాస్

వరల్డ్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో సీజన్ 4 కూడా ముగిసిపోనుంది. ఇప్పటికీ హోస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజీత్, హారిక, అరియానా, అఖిల్, సోహెల్ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది.

Bigg Boss 4 : హౌస్‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్.. అద్దాలగదికే పరిమితం చేసిన బిగ్ బాస్
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2020 | 10:16 PM

Share

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో సీజన్ 4 కూడా ముగిసిపోనుంది. ఇప్పటికి హోస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజీత్, హారిక, అరియానా, అఖిల్, సోహెల్ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మొదటి ప్లేస్ లో అభిజీత్ ఉన్నాడు. మొదటినుంచి మిస్టర్ కూల్ గా పేరుతెచ్చుకుంటూ.. తన గేమ్ తాను ఆడుతూ వస్తున్న అభిజీత్ కు భారీగానే ఓట్లు వేస్తున్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో అరియానా ఉంది. ఆ అమ్మడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాతనుంచి తెలివిగా ఆడుతూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.

ఇక సోహెల్ మూడో ప్లేస్ లో ఉన్నాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ హోస్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. సోహెల్ లో కోపం తప్ప మిగిలినవన్నీ ప్లెస్ లనే చెప్పాలి, హౌస్ మేట్స్ తో స్నేహంగా ఉంటూ మనసులో ఏం ఉంచుకోకుండా మాట్లాడుతూ.. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సోహెల్. ఇక నాలుగో ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు. అఖిల్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తెలివిగా టాస్క్ లు ఆడుతూ వస్తున్నాడు. అదేవిధంగా హారిక. ఈ అమ్మడు తనదైన యాటిట్యూడ్ తో హౌస్ లో అందరితో స్నేహం చేస్తూ టాస్క్ లు విజయవంతంగా ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడింది. ఇక ఈ ఐదుగురిలో విజేత ఎవరు అవుతారన్నది అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఇక బిగ్ బాస్4 ఫైనల్ కు అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కు హౌస్ లో వాళ్ళ జర్నీని చూపించాడు బిగ్ బాస్. అందరు తమ తమ జర్నీని చూసుకొని ఎమోషనల్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకువచ్చారు బిగ్ బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ నుంచి ఎలిమినేటి అయ్యాయి బయటకు వెళ్లిన మోనాల్, కరాటే కళ్యాణి, లాస్య, నోయల్ అవినాష్, దివి, మెహబూబ్ , గంగవ్వ, సుజాత హౌస్ లోకి వచ్చారు. వాళ్ళను చూసిన టాప్ 5 కంటెస్టెంట్స్ ఆనందంలో తేలిపోయారు. కానీ కరోనా నేపథ్యంలో వాళ్ళను గ్లాస్ గదికే పరిమితం చేశారు బిగ్ బాస్. గ్లాస్ రూమ్ నుంచి తమ హౌస్ మేట్స్ ను పలకరించారు మిగిలినవారు. దాంతో కంటెస్టెంట్స్ కాస్త నిరాశపడ్డారు.