బిగ్‌బాస్ 3 ఫలితంపై ఘాటుగా స్పందించిన యాంకర్ ఝాన్సీ..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ సీజన్‌ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్‌పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ 3 ఫలితంపై అసంతృప్తి వ్యక్తి చేసింది. గత రెండు సీజన్స్‌లో కూడా.. […]

బిగ్‌బాస్ 3 ఫలితంపై ఘాటుగా స్పందించిన యాంకర్ ఝాన్సీ..!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 6:24 PM

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ సీజన్‌ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్‌పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది.

టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ 3 ఫలితంపై అసంతృప్తి వ్యక్తి చేసింది. గత రెండు సీజన్స్‌లో కూడా.. బిగ్‌బాస్ విన్నర్స్‌గా పురుషులే ఉన్నారు. ఈ సారైనా.. మహిళలు వస్తారని అనుకున్నాం కానీ.. బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులు మహిళల్ని గెలిపించడానికి సిద్ధంగా లేరని అంది ఝాన్సీ. అమెరికా వంటి దేశాల్లోనే.. మహిళను అధ్యక్షురాలిని చేయడానికి ఇష్టపడరు.. ఇక అలాంటిది.. తెలుగు ప్రేక్షకులు మాత్రం మహిళల్ని ఎందుకు గెలిపిస్తారు అంటూ.. వ్యంగంగా కామెంట్ చేసింది ఝాన్సీ.

షోలో.. శ్రీముఖి దిబెస్ట్‌ ఇచ్చిందని.. షోలో జరిగిన అన్ని టాస్క్‌ల్లోనూ చక్కగా పార్టిస్‌స్పేట్ చేసిందని.. ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. బిగ్‌బాస్ షో.. ఇప్పటికి మూడు సీజన్స్‌ని పూర్తి చేసుకున్నా.. ఒక లేడీకి కూడా విన్ ‌అయ్యే అవకాశమే దక్కలేదని.. ఇకపై కూడా.. దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయనవసరం కూడా లేదని.. కాస్త ఘాటుగానే స్పందించింది యాంకర్ ఝాన్సీ.