
పితృ దోషం: జాతకంలో సూర్యుడు లేదా రాహువు ప్రభావం వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల వంశాభివృద్ధిలో అడ్డంకులు, కుటుంబంలో నిరంతర అశాంతి చేపట్టిన పనులు ఆగిపోవడం వంటివి జరుగుతాయి. పూర్వీకుల ఆశీస్సులు లోపించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తారు.
శని దోషం: శని దేవుడు క్రమశిక్షణకు, న్యాయానికి అధిపతి. జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు (ఏలినాటి శని లేదా ధైయా సమయంలో) పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ప్రతి విషయంలోనూ జాప్యం జరగడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరగడం ఈ దోషం ప్రధాన లక్షణాలు.
రాహు-కేతువుల ప్రతికూలత: జాతకంలో రాహువు లేదా కేతువు అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు పనులు అకస్మాత్తుగా ఆగిపోవడం, అనవసరమైన గందరగోళం ఏర్పడటం చేసే ప్రతి ప్రయత్నంలోనూ వైఫల్యం ఎదురవ్వడం జరుగుతుంది.
పరిష్కార మార్గాలు:
హనుమాన్ ఆరాధన: శని దోషం లేదా ఎలాంటి ప్రతికూలతలు ఉన్నా, హనుమంతుని పూజించడం అత్యంత శక్తివంతమైన నివారణ. ప్రతిరోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించడం వల్ల భయం తొలగిపోవడమే కాకుండా, మనోబలం పెరుగుతుంది.
పూర్వీకుల ఆశీస్సులు: పితృ దోషం ఉన్నట్లు భావిస్తే, పితృ పక్షం లేదా అమావాస్య రోజుల్లో కాకులకు ఆహారం పెట్టడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
దానధర్మాలు: శని దోషం నుండి ఉపశమనం కోసం శనివారాల్లో ఆవనూనె దానం చేయడం, పేదలకు సహాయం చేయడం చేయాలి. ఇది పాపకర్మల ప్రభావాన్ని తగ్గించి పనుల్లోని అడ్డంకులను తొలగిస్తుంది.
జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా, సరైన పరిహారాలు పాటిస్తూ, మన ప్రయత్నాన్ని కొనసాగించడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
గమనిక: పైన అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాధారణ వివరాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. జ్యోతిష్యానికి సంబంధించి వ్యక్తిగత సందేహాలు ఉంటే నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఉత్తమం.