కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఉచితంగా కరోనా కిట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

కరోనాపై పోరులో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఉచితంగా కరోనా కిట్లు(కోవిడ్- హోమ్ క్వారంటైన్ కిట్) అందించేందుకు రంగం సిద్ధం చేసింది. కోవిడ్ పేషంట్లు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కిట్లలో పేషంట్లు చేయవలసినవి.. చేయకూడని వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మొదట్లో హోం క్వారంటైన్లో ఉన్న బాధితులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. అందుకే వారికి అవి కూడా తగ్గే విధంగా అవసరమయ్యే వాటిని ప్రభుత్వం ఈ కిట్ ద్వారా అందిస్తోంది.
ఇప్పటికే దేశంలోనే రికార్డుస్థాయిలో కరోనా శసాంపిల్ టెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే కరోనా నిర్ధారణ టెస్టింగ్ కోసం ప్రతీ జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున ఏర్పాటు చేసింది. కరోనా రోగులకు హోం క్వారంటైన్ పూర్తయ్యే వరకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లతో పాటు ఆక్సిజన్ లెవెల్ను చూసుకునేందుకు వీలుగా పల్స్ ఆక్సీమీటర్ లాంటివి కూడా ఉంటాయి.
Also Read:
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..