ఇవి చంద్రబాబు కుట్రలే.. ఆయన డైరెక్షన్‌లోనే ఎంపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పని చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ

|

May 17, 2021 | 11:13 AM

MP Mithun Reddy: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని YSRCP ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. బాబు డైరెక్షన్‌లోనే రఘురామ పని చేస్తున్నారు.

ఇవి చంద్రబాబు కుట్రలే.. ఆయన డైరెక్షన్‌లోనే ఎంపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పని చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ
Mithun Reddy And Mp Balasho
Follow us on

ఎంపీ రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని YSRCP ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. బాబు డైరెక్షన్‌లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్‌ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని అన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్‌ చేసేందుకు యత్నిస్తున్నారు.

ఘురామరాజుకు సీఎం జగన్ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటానని ఎందుకు పట్టుబడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఆ రమేష్ ఆస్పత్రిలో చేర్చలేదనే ప్రాణహాని ఉందని నాటకమాడుతున్నారని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు చేస్తున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రఘురామక‌ృష్ణరాజుపై సీబీఐ కేసులు ఉన్నాని అన్నారు. ప్రజలు చెత్త రాజకీయాల ట్రాప్‌లో పడొద్దని ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థించారు.

ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంతలా హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇక ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని మరో ఎంపీ బాలశౌరి విమర్శించారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ రఘురామకృష్ణరాజు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :  గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వ‌చ్చి చూడ‌గా షాక్

Shahid Jameel: కోవిడ్ పాండమిక్ అదుపులో ప్రభుత్వం విఫలం, కరోనా కట్టడి ఫోరానికి సీనియర్ వైరాలజిస్ట్ గుడ్ బై

పిల్లల సంరక్షణ కోసం కేరళ శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు